ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

by Dishanational1 |
ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన రామటెంకి తిరుపతమ్మ -భానుచందర్ కూతురు భవిత ఎంబీబీఎస్ సీటు సొంతం చేసుకున్నందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభినందించి, రూ. 20 వేల ఆర్థిక సాయం చేశారు. భవిత గురుకుల పాఠశాలలో కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్స్ రాసి ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాద్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందించి, శాలువాతో సన్మానించి, ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. సదరు విద్యార్థి ఉన్నత విద్య కోసం అయ్యే ఖర్చుని అంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎంపీపీ, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed