- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో 23 శాతం వృద్ధి!
by Harish |

X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య భారత వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు అంతకుముందు నాటితో పోలిస్తే 23 శాతం పెరిగి 19.7 బిలియన్ డాలర్ల(రూ. 1.51 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 15.97 బిలియన్ డాలర్లు(రూ. 1.22 లక్షల కోట్లు) గా నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన కాలంలో బియ్యం ఎగుమతులు 7.7 బిలియన్ డాలర్లు(రూ. 59.2 వేల కోట్లు)గా ఉన్నాయి. గోధుమల ఎగుమతులు 1.74 బిలియన్ డాలర్ల(రూ. 13.37 వేల కోట్లు)కు పెరిగాయి. అలాగే, మాంసం, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 13 శాతం పెరిగి 3.40 బిలియన్ డాలర్ల(రూ. 26 వేల కోట్లు)కు, పండ్లు, కూరగాయలు 16 శాతం పుంజుకుని 1.20 బిలియన్ డాలర్లు(రూ. 9,225 కోట్లు)గా నమోదయ్యాయి.
Next Story