- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధక్షేత్రం నుంచి భారతీయుల తరలింపు.. భారత విమానాలకు ఫైటర్ జెట్స్ భద్రత!
యుద్ధక్షేత్రం నుండి భారతీయుల సురక్షిత తరలింపు: 58 ప్రత్యేక విమానాలతో మోదీ ప్రభుత్వం భారీ ఆపరేషన్. గగనతలంలో భారతీయ విమానాలకు పటిష్ట భద్రత.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేశాయి. దీంతో ఆగ్రహించిన ఇరాన్.. అరబ్ కంట్రీస్ లోని అమెరికా బేస్ క్యాంపులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అలాగే ఇతర పర్యాటక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో అరబ్ కంట్రీస్లో ఉన్న భారతీయుల రక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో పశ్చిమ ఆసియాలో తీవ్ర యుద్ధ వాతావరణం నేపథ్యంలో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది.
దీనిలో భాగంగా మార్చి 4, 2026 నాటికి ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు కలిపి సుమారు 58 ప్రత్యేక విమానాలను నడుపుతూ వేలాది మందిని స్వదేశానికి తరలిస్తున్నాయి. యుద్ధం కారణంగా గగనతలం అత్యంత ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విదేశీ గడ్డపై ఉన్న ప్రతి భారతీయుడి ప్రాణం విలువైనదేనని చాటుతూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆపరేషన్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ విమానానికి ఫైటర్ జెట్స్ భద్రత కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుత సంక్షోభంలో భారతీయ విమానాలు అత్యంత సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తూ, యుద్ధ ప్రభావం లేని గగనతలం గుండా తమ గమ్యాన్ని చేరుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పౌర విమానాలకు రక్షణగా యుద్ధ విమానాలు కాపలా కాస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా వైరల్ గా మారిన వీడియో పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికి ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో విమాన ప్రయాణాలు ప్రమాదకరంగా మారినప్పటికీ, ఎయిర్ ఇండియా, ఇతర భారతీయ విమానయాన సంస్థలు తమ సిబ్బందిని, ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా తన పౌరులను కాపాడుకోవడంలో భారత్ ముందుంటుందనే విషయాన్ని ఈ చర్య మరోసారి స్పష్టం చేస్తోందని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






