ఎన్యూమరేషన్ ఫారాన్ని గడువులోగా బీఎల్ఓలకు అందించాలి:డిప్యూటీ కమిషనర్

by Jakkula.Mamatha |

ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంను నిర్ణీత గడువులోగా బీఎల్ఓలకు అందజేయాలని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకట మణి కరణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్యూమరేషన్ ఫారాన్ని గడువులోగా బీఎల్ఓలకు అందించాలి:డిప్యూటీ కమిషనర్
X

దిశ, దుండిగల్: ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంను నిర్ణీత గడువులోగా బీఎల్ఓలకు అందజేయాలని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకట మణి కరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ను నింపి రెండు లేదా మూడు రోజుల్లో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకు అందజేయాలన్నారు. సరైన వివరాలతో నింపి సమర్పించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లు మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో చేర్చబడుతాయన్నారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి మీ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని సూచించారు. వివరాలు కోసం https:#voters.eci.gov.in అనే అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

Next Story