నేడు మణిపూర్‌లో సెకండ్ ఫేజ్.. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

by Disha Web Desk 17 |
నేడు మణిపూర్‌లో సెకండ్ ఫేజ్.. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
X

ఇంఫాల్ : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లో శనివారం సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలకు గాను తొలి దశలో మొత్తం 38 స్థానాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఆరు జిల్లాల్లో మిగిలిన 22 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. మణిపూర్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మార్చి 3 వరకు ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగిసింది. రెండో దశ పోలింగ్ మార్చి 5న నేటితో ముగియనుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 8.3లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా అందులో మహిళలు 4,25,192 పురుషులు 4,07,224 మంది ఉన్నారు.



Next Story

Most Viewed