- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన మోసాన్ని బయటపెట్టిన ఈషా రెబ్బా.. షాకింగ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba)అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ తెలుగమ్మాయికి పరిశ్రమలో ఆశించిన స్థాయిలోఫేమ్ రాలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba)అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ తెలుగమ్మాయికి పరిశ్రమలో ఆశించిన స్థాయిలోఫేమ్ రాలేదు. పలు చిత్రాల్లో నటించినా అవేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈషా, ప్రస్తుతం తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)సరసన నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జనవరి 30న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న తరుణంలో, ప్రమోషన్లలో భాగంగా ఆమె తన సినీ ప్రయాణంలోని చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాపై ఈషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో నటించే సమయంలో తనకు అనేక సందేహాలు ఉన్నాయని, ఒక కమర్షియల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేస్తే భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలే వస్తాయేమోనని భయపడ్డానని తెలిపారు.
అయితే అది పెద్ద బ్యానర్, స్టార్ డైరెక్టర్ కావడం.. పైగా త్రివిక్రమ్ అది ఒక లీడ్ రోల్ అని నమ్మబలకడంతో ఆ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె వివరించారు. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, అసలు ఆ పాత్రలో ఏముందని చాలా మంది ఫోన్ చేసి తనను విమర్శించారని ఈషా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు అరవింద సమేతలో మంచి పాత్ర అని చెప్పి, అలాంటి క్యారెక్టర్ ఇచ్చి త్రివిక్రమ్ మోసం చేశారు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చినందుకు సంతోషపడాలో, లేక ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో అప్పట్లో ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు.






