- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యం
by Dishanational1 |
X
దిశ, చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీకి చెందిన రుద్రపంగు శివయ్య(50)గా గుర్తించినట్టు తెలిపారు. శివయ్య రోజూవారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను గురువారం తెల్లవారుజామున ప్రాజెక్టులోని మూడవ గేట్ నెంబర్ వద్ద నీటిలో తేలియాడుతూ మృతదేహంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Next Story