శ్రీరామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎస్ సోమేశ్ కుమార్

by Web Desk |
శ్రీరామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎస్ సోమేశ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట రామలింగేశ్వరస్వామిని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (చీఫ్ సెక్రెటరీ) సోమేశ్ కుమార్ కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం దర్శించుకొన్నారు. ఈ మేరకు సోమేశ్ కుమార్ కుటుంబసభ్యులకు ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం కీసర రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలను నిర్వహించారు. ఆలయంలో వేదపండితుల ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందచేసిన్నారు.

ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న కీసర రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, ఆవరణలో చేసిన ఏర్పాట్లను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ హరీశ్‌తో పాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సీఎస్ వెంట జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, శాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఆయా శాఖల అధికారులు, పోలీసులు, సిబ్బంది ఆలయ ఈవో, ఆలయ ఛైర్మన్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed