రైతు భరోసాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: అడ్డి బోజారెడ్డి

by Jakkula.Mamatha |

రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు.

రైతు భరోసాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: అడ్డి బోజారెడ్డి
X

దిశ, భీంపూర్ : రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు. తాంసీ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత BRS ప్రభుత్వం అప్పులు చేసిందని, దాని పర్యవసానాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కౌడల సంతోష్, ఆత్మ చైర్మన్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, గంగుల వెంకన్న, రామన్న యాదవ్, ఉప సర్పంచ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story