చిత్తలూరు జీపీవో రజిత సస్పెండ్

by Jakkula.Mamatha |

సాదాబైనామా వ్యవహారంలో మహిళా రైతు నుంచి చిత్తలూరు జీపీవో రజిత రూ.22 వేల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై స్పందించిన జిల్లా కలెక్టర్, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని తహసీల్దార్ మాధవరావును ఆదేశించారు.

చిత్తలూరు జీపీవో రజిత సస్పెండ్
X

దిశ,శాలిగౌరారం: సాదాబైనామా వ్యవహారంలో మహిళా రైతు నుంచి చిత్తలూరు జీపీవో రజిత రూ.22 వేల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై స్పందించిన జిల్లా కలెక్టర్, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని తహసీల్దార్ మాధవరావును ఆదేశించారు. ఈ ఘటనపై గురువారం సాయంత్రం తహసీల్దార్ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్ జీపీవో రజితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్ మాధవరావు విలేకరులకు తెలిపారు.

Next Story