- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శబ్ద వేగంతో ప్రయాణమే కొంపముంచిందా.. చైనా విమాన ప్రమాదం వెనుక నిజాలు

నేషనల్: చైనాలో ఇటీవల కులిపోయిన విమాన ప్రమాదానికి కారణాలను వైమానికి నిపుణలు శోధిస్తూనే ఉన్నారు. కానీ శబ్దవేగం తో తక్కువ ఎత్తులో ప్రయాణించడమే ఆ ఘోర ప్రమాదానికి దారి తీసిందని అనుమానిస్తున్నారు. 132 మంది ప్రయాణికులతో 29,000 అడుగుల ఎత్తున చైనాకు చెందిన బోయింగ్ కో. 737-800 విమానం శబ్దవేగం తో గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. శబ్ద వేగం తో ప్రయాణించిన ఈ విమానం కిందికి దూసుకెళ్లి కొండపై పడిందని పేర్కొంది. ఒక సమయంలో విమానం గంటకు 700 మైళ్ల వేగంతో కూడా ప్రయాణించిందని సమాచారం.
సముద్ర మట్టం వద్ద శబ్దం గంటకు 761 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది కానీ వాయు ఉష్ణోగ్రత నెమ్మదించినప్పుడు 35 వేల అడుగుల ఎత్తున గంటకు 663 మైళ్ల వేగంతోనే అది ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 29 వేల అడుగుల ఎత్తు వద్ద ప్రయాణిస్తున్న చైనా విమానం ఉన్నట్లుండి కిందికి దిగడం ప్రారంభించిందని విమానంలో ట్రాన్స్మిట్ అయిన డేటా పేర్కొంది. చివరకు గంటకు 595 మైళ్ల వేగంతో అది కిందికి కూలిపోయిందని అంటున్నారు.
ఈ విమాన ప్రమాదాన్ని ఆత్యంత వేగంతో కూడిన క్రాష్గా చెప్పవచ్చు అని వైమానిక రంగ నిపుణుడు బాబ్ మాన్ చెప్పారు. శరవేగంతో బిలంలో కూలిపోయినట్లు గా ఉందని చెప్పారు. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు 288 మైళ్ల కంటే వేగం తో జెట్ విమానాలు ప్రయాణించవని కానీ, ఆ ఎత్తులో చైనా విమానం గంటకు 470 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ఉందని ఫ్లైట్ రాడార్ 24 డేటా తెలిపింది. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.