భోజనం కావాలని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు

by Dishanational1 |
భోజనం కావాలని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
X

దిశ, ఓదెల: భోజనం కావాలని అడిగి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమట్ల కవిత అనే మహిళ కొలనూరులో బీహార్ నుంచి రైల్వే పనికి వచ్చినవారికి వంట చేస్తూ ఉంది. అయితే, ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో భోజనం కావాలని దుండగులు అడిగారు. ఆ వెంటనే ఆమె నోరు మూసి మెడలో ఉన్న పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోతకపల్లి ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.

Next Story

Most Viewed