- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌమహల్లా ప్యాలెస్లో మార్పు కోసం చేతులు కలిపిన ప్రముఖులు
చారిత్రక చౌమహల్లా ప్యాలెస్లోని అద్భుతమైన షాండిలియర్ల కాంతిలో, గ్రామీణ భారత భాగ్యం మార్చే సమున్నత లక్ష్యం కోసం నగరం ఏకమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: చారిత్రక చౌమహల్లా ప్యాలెస్లోని అద్భుతమైన షాండిలియర్ల కాంతిలో, గ్రామీణ భారత భాగ్యం మార్చే సమున్నత లక్ష్యం కోసం నగరం ఏకమైంది. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని అందిస్తూ ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచుతున్న కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ నిర్వహించిన వార్షిక ఫండ్రైజర్ 2026 శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దాతృత్వవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొని గ్రామీణ నీటి భద్రతకు మద్దతు ప్రకటించారు. రేస్విన్ ఫౌండేషన్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, ఫండ్రైజింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రతిక్ష ప్రసాంత్ నేతృత్వంలో దాతలు స్పందించి, మరో 25 గ్రామీణ పాఠశాలలకు సురక్షిత నీటిని అందించేందుకు అవసరమైన నిధులను సమకూర్చారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత పింకీ రెడ్డి, ప్రత్యేక అతిథి వక్తగా విచ్చేసిన సామాజిక కార్యకర్త, నటి నందితా దాస్ సురక్షిత నీరు ప్రాథమిక హక్కు అని, అది అభివృద్ధికి తొలి అడుగు అని అభిప్రాయపడ్డారు. సంస్థ వ్యవస్థాపకుడు రవి రెడ్డి మాట్లాడుతూ, కేవలం దానధర్మం కాకుండా కమ్యూనిటీల భాగస్వామ్యంతో నడిచే నివారణాత్మక ఆరోగ్య మౌలిక వసతులుగా ఈ ప్రాజెక్టులను తీర్చిదిద్దామన్నారు.






