మున్సిపాలిటీలో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం

by Dishanational1 |
మున్సిపాలిటీలో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం
X

దిశ, పరిగి: పరిగి మున్సిపాలిటీలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని డీసీఎంఏ డైరెక్టర్​సత్యనారాయణమూర్తి అన్నారు. వికారాబాద్​జిల్లా పరిగి మున్సిపల్​పరిధిలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా పరిగిలోని 2వ వార్డులో నర్సరీ, మూడవ వార్డులో పార్కును పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పార్కుల గురించి ఎమ్మెల్యే, మున్సిపల్​సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి సూచించగా సీడీఎంఏ డైరెక్టర్​దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే భర్తీ చేస్తామన్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన ఎల్​ఆర్​ఎస్ నిధులు కూడా మంజూరు చేయిస్తామన్నారు. మున్సిపాలిటీలో పన్నుల వసూలు 60 శాతం మాత్రమే చేశారని వెంటనే 100 శాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి డైరెక్టర్​సత్యనారాయమూర్తికి తెలిపారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేతోపాటు మున్సిపాలిటీ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ముకుంద అశోక్ కుమార్, కమిషనర్ ప్రవీణ్​కుమార్​రెడ్డి, మున్సిపల్ డీఈ యూనూస్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, నాగేశ్వర్, నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed