అదుపు తప్పిన కారు.. ముగ్గురికి గాయాలు

by Disha Web Desk 13 |
అదుపు తప్పిన కారు.. ముగ్గురికి గాయాలు
X

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని బుర్ర వేముల గ్రామంలో ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. భద్రాచలం నుంచి లక్ష్మీ నగరం వైపు వస్తున్న మారుతి 800 కారు (TS28J3910 ) ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి కుడి వైపునకు దూసుకు వెళ్లడంతో.. లక్ష్మీ నగరం వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి రోడ్డు కిందకి ఈడ్చుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు ఆతుకూరి వంశీ(29), వారి ఇద్దరు పిల్లలు గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వైద్యం కోసం భద్రాచలం తీసుకువెళ్ళారు.

Next Story

Most Viewed