'ఇది తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం'

by Disha Web Desk 2 |
ఇది తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా హోలీ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. పగలు, పంతాలు మర్చిపోయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ''పుట్టెడు దుఖఃంలో మునిగిన తెలంగాణలో రంగులతో హోలీ ఆడే సమయం దొరకడం లేదు. ఇది దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం. Anyway, Happy Holi.'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌కు మద్దతిస్తూ కొంతమంది రీట్వీట్ చేస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.



Next Story

Most Viewed