బ్రేకింగ్ న్యూస్.. మరికాసేపట్లో అమిత్ షా తో గవర్నర్ తమిళిసై బేటి..?

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. మరికాసేపట్లో అమిత్ షా తో గవర్నర్ తమిళిసై బేటి..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో బేటి అయ్యే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. అలాగే.. ప్రోటోకాల్ ఉల్లంఘన, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి తో చర్చించనున్నట్టు సమాచారం.

గత కొంత కాలంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పలు సందర్బాల్లో ముఖ్య కార్యక్రమలలో గవర్నర్ రాక సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా.. సాధరణ అదికారులతో స్వాగతం పలికించడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని పలు సార్లు గవర్నర్ బహిరంగంగానే తాను ఎవరికి బయపడే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చిన తరుణంలో కేంద్ర హోం శాఖ మంత్రి తో గవర్నర్ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Next Story

Most Viewed