ప్రియురాలు దానికి ఒప్పుకోలేదని.. కన్నవారి ముందే ఆ పని చేసిన ప్రియుడు

by Disha Web |
ప్రియురాలు దానికి ఒప్పుకోలేదని.. కన్నవారి ముందే ఆ పని చేసిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరూ ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఒక్కసారిగా ప్రియుడు తన ప్రేయసిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌ జోద్‌పూర్ జిల్లాలోని పాలిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితులు ఛగన్ బంజారా, మమతా బంజారా (23) ఇద్దరూ క్యాటరింగ్, స్వీట్ల వ్యాపారంలో కలిసి గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఒకే చోట పనిచేస్తుండంటంతో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇలా కొంత కాలం సంతోషంగా కలిసి తిరిగారు.

కాగా, మమతకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఛగన్ అనుమానించాడు. ఈ విషయమై వారి మధ్య చాలా సందర్భాల్లో వాదనలు జరిగాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా అతను చాలాసార్లు ఆమెను హెచ్చరించాడు. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను అడగడం ప్రారంభించాడు. అతడు అడిగిన ప్రతిసారీ మమత తిరస్కరిస్తూనే వచ్చింది. ఈ కారణంగా ఛగన్ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. మమతను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. అనుకున్నదాని ప్రకారం.. "శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఛగన్ సుభాష్ నగర్‌లోని మమత ఇంటికి పిస్టల్‌తో చేరుకున్నాడు. ఆమె తన కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేస్తుండగా, ఆమె ఇంట్లోకి దూసుకెళ్లాడు. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆమెను పట్టుకుని తలపై కాల్చాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. వెంటనే ఛగన్ కూడా తన తలపై కాల్చుకున్నాడు" అని పోలీసులు తెలిపారు. అయితే ఛగన్‌ను కొనప్రాణాలతో ఉండగా జోధ్‌పూర్‌ ఆసుపత్రికి రిఫర్ చేయగా, అక్కడ అతను చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఛగన్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతని భార్య చాలా కాలంగా అతనితో కలిసి ఉండడం లేదు. మమతను కలిసిన తర్వాత తన భార్యను పూర్తిగా వదిలేసి మమతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఛగన్‌కు అప్పటికే పిల్లలు ఉండడంతో మమత, ఆమె తల్లి ఇందుకు ఒప్పుకోలేదు. మమత కూడా రెండు సార్లు వివాహం చేసుకుంది. అయితే ఆమె వారి ఇద్దరితో కలిసి ఉండడం లేదు. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో నివసిస్తోంది.

Next Story

Most Viewed