నోటిఫికేషన్ విడుదల విషయంలో యువతకు నిరాశే!

by Disha Web Desk 13 |
నోటిఫికేషన్ విడుదల విషయంలో యువతకు నిరాశే!
X

దిశ, మహేశ్వరం: టీవీల ముందు కూర్చున్న యువతకు నిరాశే మిగిలిందని బీజేవైఎం కందుకూరు మండల అధ్యక్షుడు లింగం యాదవ్ ఆరోపించారు. బుధవారం కందుకూరు మండల కేంద్రంలో రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లింగం యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సీఎం కేసీఆర్ కేవలం 91 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ భృతి పై సీఎం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, మహేందర్, నాయకులు అండేకార్ శ్రీనివాస్, మధుకర్, భాస్కర్, వంశీధర్ రెడ్డి, సింగ్ నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed