యాదాద్రి ఆలయంపై ట్విట్టర్‌లో బీజేపీ-టీఆర్ఎస్ వార్

by Disha Web Desk |
యాదాద్రి ఆలయంపై ట్విట్టర్‌లో బీజేపీ-టీఆర్ఎస్ వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నించిన యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే, తెలంగాణకే తలమానికంగా వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆలయంపై ట్విట్టర్ వేదికగా చర్చ జరగుతోంది.

టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీని ఉద్దేశిస్తూ '' లేస్తే హిందుత్వం, హిందుత్వం అని మాట్లాడే పువ్వులకు తెలంగాణలో కట్టిన యాదాద్రి గుడి మాత్రం కనపడదు..! యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు హిందూ దేవుడు కాదా లేక బీజేపీకి దేవుడు కాదా?. బీజేపీది దేవుడి పైన భక్తి కాదు, కేవలం రాజకీయం పైన భక్తి ! గుజరాత్ చిలుకా ఏం పలకలేదేమో.!'' అంటూ చేసిన ట్వీట్‌పై బీజేపీ కార్యకర్తలు, ఇతర నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

యాద్రాద్రి ఆలయం రాష్ట్రంలోని ప్రజాధనంతో కట్టినది.. ఇది ప్రజలందరి ఆలయం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. '' మాకు రాముడైన, నరసింహుడైన, విష్ణుమూర్తి స్వరూపాలే.. శ్రీ రామమందిర నిర్మాణాన్ని రాజకీయం చేసింది మీరు. యాదాద్రిని ప్రజల సొమ్ముతోనే కదా నిర్మించింది.. అప్పుడు మా అందరి దేవుడే కదా, మీ బాధ ఏంది అసలు?'' అంటూ మండిపడుతున్నారు.


Next Story