UP MLC Elections: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 36 కు 33 సీట్లు కైవసం

by Disha Web Desk 12 |
UP MLC Elections: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 36 కు 33 సీట్లు కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 36 స్థానాలకు గాను బీజేపీ 33 స్థానాలు గెలుచుకుంది. అధికార పార్టీ ఇప్పటికే తొమ్మిది స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాగా వారణాసిలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అలాగే అజంగఢ్, ప్రతాప్‌గఢ్ స్థానాలను కూడా స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బీజేపీ బలం పెరగనుంది.


Next Story