'పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి'

by Disha Web Desk 13 |
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
X

దిశ, కంది: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రసాది రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి సూచనతో సంగారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో ఎం.ఆర్.ఓ స్వామికి స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉంటుందని, ఈ తరుణంలో ప్రజలపై ప్రభుత్వం భారం పడేలా విద్యుత్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచడం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళీధర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు పవన్ ముదిరాజ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యశ్వంత్, బీజేవైఎం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed