- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పలు ఇళ్లలో చోరీ.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
దిశ, కంది : సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి దొంగలు పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతి నగర్ కాలనీలోని పీవీఆర్ హోమ్స్ అపార్ట్మెంట్లో ఉంటున్న ఇద్దరి ఇళ్లలో ఆదివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. అయితే అదే అపార్ట్ మెంట్లోని మరో ఇంట్లో లక్ష రూపాయల విలువ గల బంగారంతో పాటు నగదు కాజేశారు. ఆ పక్కనే తాళం వేసిన మరో ఇంట్లో ఆరు తులాల బంగారంతో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఇళ్ల వారు పని నిమిత్తం ఊరికి వెళ్లారు. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే అపార్ట్మెంట్లో ఇప్పటివరకు సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా అర్ధరాత్రి నిద్రించడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితులు వాపోయారు. అయితే దొంగలు పక్క వీధిలో ఉన్న మరో రెండిళ్లలో దొంగతనానికి యత్నించగా అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలను సేకరించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.