శుభవార్త చెప్పిన సీఎం.. ఇక నుంచి మీ ఇంటి వద్దకే రేషన్

by Dishanational1 |
శుభవార్త చెప్పిన సీఎం.. ఇక నుంచి మీ ఇంటి వద్దకే రేషన్
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ లో ఎన్నికల నుంచి సంచలన నిర్ణయాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు మరింత దగ్గరవుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భగవంత్ మాన్ మరో సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త మరో చెప్పారు. లబ్ధిదారులెవరూ ఇక నుంచి రేషన్ షాపుల వద్ద నిల్చోవాల్సిన అవసరంలేదని.. నేరుగా లబ్ధిదారుల ఇంటికే గిన్నీ బ్యాగుల్లో రేషన్ పంపిస్తామన్నారు. డబ్బున్నవాళ్లు ఏది కావాలన్నా వారి ఇంటికి వద్దకే తెప్పించుకుంటున్నారని.. కానీ, పేదలు మాత్రం ఏది కావాలన్నా వాటి వద్దకే వెళ్లాల్సి వస్తోందని, ఆఖరికి వృద్ధులు కూడా రేషన్ షాపుల వద్ద నిలబడాల్సి వస్తోందని.. ఈ పరిస్థితిని మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed