- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముని విగ్రహ వివాదం.. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్ వీధులు
బంగ్లాదేశ్లో శ్రీరాముని విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్లో శ్రీరాముని విగ్రహం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గైబంధా జిల్లా పలాశబాడగ్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 82 అడుగుల భారీ రాముని విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఇస్లామిక్ గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడి హిందూ సమాజం భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చింది. హిందూ సంఘాలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ 'జై శ్రీరామ్' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
ఒకవైపు విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఇస్లామిక్ గ్రూపులు పట్టుబడుతుండగా, మరోవైపు విగ్రహ నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలని, మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలని హిందూ సంఘాలు దీటుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఉదంతం బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీస్తోంది.






