ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పయ్యావుల

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 13:49:37  IST  )

కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలు నిర్వహించాలని నేడు జరిగిన కేబినెట్ భేటీలో డిసైడ్ చేశారు.

ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పయ్యావుల
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలు నిర్వహించాలని నేడు జరిగిన కేబినెట్ భేటీలో డిసైడ్ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 12న గవర్నర్ ప్రసంగానికి సభలో ధన్యవాద తీర్మానం చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 14న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Next Story