- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వెన్ను నొప్పి బాధితులకు వరం: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

దిశ, బంజారాహిల్స్: వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడే రోగుల కొరకు హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సెంటర్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ను ప్రారంభించామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.92లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్ను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సదుపాయలు అందుతున్నాయి కాబట్టే ఇతర రాష్ట్రాలతో పాటు పలు దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారని అన్నారు. ఎంతో మంది నిత్యం వెన్ను నొప్పితో బాధపడుతుంటారని అలాంటి వారందరికీ ఈ ఆస్పత్రి మంచి పరిష్కారాలు చూపుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రి ఎండీ. ఛైర్మన్ డాక్టర్ సుకుమార్ సూర మాట్లాడుతూ.. స్పైన్ సర్జరీల విషయంలో చాలా మందికి భిన్న అభిప్రాయాలు, అపోహలు ఉన్నాయని తమ ఆస్పత్రిలో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరి అపోహలు తొలగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో పగడిమర్రి నరేష్, మాక్సి విజన్ ఆస్పత్రి ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, డాక్టర్ సి. నరసింహన్, డాక్టర్ కె తంగరాజ్, మురళీ జయరామన్ తదితరులు పాల్గొన్నారు.