రాష్ట్రాలు దాటిస్తున్న గంజాయి.. పోలీసుల దాడిలో ముఠా అరెస్ట్!

by Disha Web Desk 13 |
రాష్ట్రాలు దాటిస్తున్న గంజాయి.. పోలీసుల దాడిలో ముఠా అరెస్ట్!
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: ఆంధ్ర నుండి మహరాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న ముఠాలోని ఏడుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు పరారీలో ఉన్నాడు. వీరి నుండి రూ.7 లక్షల 65 వేలు విలువగల 52 కిలోల గంజాయితో పాటు ఒక కారు, ఆటో, ద్విచక్రవాహనం, ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయిని వరంగల్ దాటిస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఆత్మకూర్ పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ టీం నీరుకుళ్ళ క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో అంబర్‌పేట్ కు చెందిన రమేశ్, భద్రాద్రి, కొత్తగూడెం, మణుగూర్ ప్రాంతాలకు చెందిన బానోత్ రాజ్ కుమార్, సనాపా సాయి, మేడియం గోవింద్, జక్కమపూరు సాయి కుమార్, దుంపటి సాయికుమార్, చల్లా సంతోష్ లు ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు పోలీసులను డీసీపీ అభినందించారు.



Next Story

Most Viewed