ఆరోగ్యశ్రీ బకాయిలు @700 కోట్లు.. పేషెంట్‌లకు తప్పని తిప్పలు..

by Disha Web Desk 19 |
ఆరోగ్యశ్రీ బకాయిలు @700 కోట్లు.. పేషెంట్‌లకు తప్పని తిప్పలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.700 కోట్లు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ వరకు ప్రైవేట్​ఆస్పత్రుల్లో 88,958 మందికి, గవర్నమెంట్‌లో 57,676 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్‌మెంట్​అందించారు. ఈ రెండు సెక్టార్లూ కలిపి రూ.349 కోట్లా 11 లక్షలా 86,333 బకాయిలున్నాయి. గడిచిన ఆరు నెలల పెండింగ్​బిల్లులు కలిపితే దాదాపు రూ.700 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రైవేట్​ఆస్పత్రులు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పాత బిల్లులే సకాలంలో అందని క్రమంలో కొత్త పేషెంట్లను చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. టీఆర్ఎస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రూ.500 కోట్ల చొప్పున ఎనిమిదేళ్లలో రూ.4138 కోట్లా 78 లక్షలు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసినట్లు పేర్కొన్నది.




Next Story