విజయసాయిరెడ్డి vs అయ్యన్నపాత్రుడు.. హీటెక్కిన ఏపీ రాజకీయం

by Disha Web |
విజయసాయిరెడ్డి vs అయ్యన్నపాత్రుడు.. హీటెక్కిన ఏపీ రాజకీయం
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం, వైసీపీల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుల మధ్య ట్వీట్ల దుమారం రేపుతోంది. విజయసాయిరెడ్డి కౌంటర్, అయ్యన్నపాత్రుడు ఎన్‌‌కౌంటర్‌లతో ట్విట్టర్ రాజకీయాలు హీటెక్కాయి. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 'ఎవరో కన్నబిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలబ్రేట్ చేసినంత దరిద్రంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం ఉందని' విమర్శలు గుప్పించారు.

టీడీపీ చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీ కాదని, నందమూరి తారకరామారావు నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసన్నారు. 'చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో'.. అంటూ చురకలంటించారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌కు అయ్యన్నపాత్రుడు ఏకంగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవడికో పుట్టిన బిడ్డ యుశ్రారైకాపాని మీ బిడ్డ అని చెప్పుకోవడానికి ఇసుమంత సిగ్గు కూడా లేని మీరు ఇతర పార్టీల గురించి మాట్లాడటం వింతగా ఉంది సాయిరెడ్డి అంటూ విరుచుకచుపడ్డారు. అది జగన్ రెడ్డి బిడ్డ కాదు కాబట్టే ఆవిర్భావ దినోత్సవానికి సవతి తండ్రిలా ఒక ట్వీట్ పడేసి వదిలేశాడు. అధికారం కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న జగన్ రెడ్డి కుర్చీ దక్కగానే వారిని ఎడమ కాలితో పక్క రాష్ట్రానికి తన్నాడు. కేర్ అఫ్ అడ్రస్ లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగ్గడుకి, నీకు టీడీపీ గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

Next Story