- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు విముక్తి!
ఓమన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న షానవాజ్ అనే మహిళ కేంద్ర ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీ సహాయంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.

దిశ, వెబ్డెస్క్: అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక సామాన్య మహిళ కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం, యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తాయో చాటిచెప్పే హృదయపూర్వక ఘటన వెలుగులోకి వచ్చింది. వాయల్పాడుకు చెందిన షానవాజ్ అనే మహిళ ఉపాధి కోసం ఓమన్కు వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తాను సురక్షితంగా భారతదేశానికి చేరుకోవాలంటూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వెంటనే స్పందించిన నాయకత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మరియు ఓమన్ అధికారుల సత్వర స్పందన, సమన్వయంతో ఆమె ఎట్టకేలకే నిన్న రాత్రి సురక్షితంగా హైదరాబాద్ చేరుకుంది.
ఈ విజయవంతమైన ఆపరేషన్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల వంటి క్లిష్ట సమయాల్లో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చినట్లే, ఇప్పుడు షానవాజ్ విషయంలోనూ మానవీయ దృక్పథం తో వ్యవహరించింది. ఈ ప్రక్రియలో నిరంతరం అండగా నిలిచిన జనసేన గల్ఫ్ కార్యకర్తలు, ఎన్డీయే కూటమి శ్రేణులు మరియు ఏపీఎన్ఆర్టీ (APNRT) అసోసియేషన్ కృషితో ఆమె ఈరోజు తన నివాసానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వారు కష్టాల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు సంబంధిత నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.






