భారత కీర్తి మరింత పెరిగింది: ముఖ్యమంత్రి జగన్

by Web Desk |
AP CM Jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి సోమవారం తెల్లవారుజామున 5.59 గంటలు పీఎస్ఎల్వీ-52 రాకెట్ విజయవంతమైనట్లు ఇస్రో అధికారకంగా ప్రకటింటించింది. అయితే ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగం ఇది. ఇందులో ఉన్న ఈఓఎస్‌–04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1 అలాగే మరో రెండు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకేల్లింది. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అంతేకాకుండా ఈ విజయంతో భారత అంతరిక్ష ఇస్రో అభివృద్ధి చెందిన దేశాలకు తక్కువ ఏమి కాదని మరోసారి నిరూపించిందని అన్నారు. ఈ ప్రయోగంతో భారత దేశం కీర్తి మరింత పెరిగిందని అన్నారు.

Next Story