- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Telangana News: చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేయబోయిన అపరిచితుడు..
దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు ఓ అపరిచిత వ్యక్తి ప్రయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్కూల్ కి వెళ్తున్న విద్యార్థినికి తాగిన మైకంలో ఉన్న ఓ అపరిచిత వ్యక్తి చాక్లెట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిన ఆ విద్యార్థిని వెంటనే క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ వ్యక్తి క్లాస్ రూం కిటికిలో నుండి కూడా చూడగా.. భయంతో విద్యార్థిని సోదరుడు పేరెంట్స్ కు చెప్పారు. ఈ క్రమంలో స్థానికులు, పేరెంట్స్ ఆ అపరిచిత వ్యక్తిని కిడ్నాపర్ గా భావించి, పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, పిల్లల భద్రతను గాలికి వదిలేశారని పేరెంట్స్ ఆరోపించారు. కిడ్నాప్కు యత్నించిన వ్యక్తి మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. అనంతరం ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.