'రాధేశ్యామ్'పై బన్నీ ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web |
రాధేశ్యామ్పై బన్నీ ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భీమ్లా నాయక్ సినమా గురించి చిరంజీవి, మహెష్ బాబు లాంటి స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో కలిసి థియేటర్‌లో "భీమ్లా నాయక్" చూశాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. దీంతో మెగా ఫ్యామిలీలో అంతర్గత కలహాలు ఉన్నట్లు రూమర్స్ కూడా క్రియోట్ అయ్యాయి. కానీ ప్రస్తుతం సినీ రంగంపై నడుస్తున్న రాజకీయాలు కారణాలవల్లే భీమ్లా గురించి అతను మౌనంగా ఉన్నాడని కొంతమంది పెద్ద మనుషులు వెల్లడించారు.

కాగా, అల్లు అర్జున్, ప్రభాస్ నటులు కాకముందే చాలా మంచి స్నేహితులని తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్ తమ సినిమాలను ఒకరిని ఒకరు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకుంటుంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్, ప్రభాస్ రాధే శ్యామ్‌ను మొదటి రోజునే చూడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరు, మహేష్ బాబు వంటి వారు కూడా రాధే శ్యామ్ గురించి త్వరలోనే ట్వీట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed