Rajnath Singh: సుప్రీంకోర్టుకు 'అగ్నిపథ్' వివాదం.. స్పందించిన రాజ్‌నాథ్ సింగ్

by Disha Web Desk 2 |
Rajnath Singh Says, we will discuss with retired army over agneepath scheme
X

దిశ, వెబ్‌డెస్క్: Rajnath Singh Says, we will discuss with retired army over agneepath scheme| కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. తాజాగా.. ఈ ఆందోళనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ పథకంపై ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్కీమ్‌పై విస్తృత చర్చల తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 10th పూర్తైన తర్వాత అగ్నిపత్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. అగ్నివీరులకు అన్ని రకాల రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలోనూ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed