ఆశ‌ల పల్లకిలో త్రిష.. ఆరేళ్ల త‌ర్వాత విడుదలవుతున్న సినిమా

by Dishanational1 |
ఆశ‌ల పల్లకిలో త్రిష.. ఆరేళ్ల త‌ర్వాత విడుదలవుతున్న సినిమా
X

దిశ, సినిమా : స్మైలింగ్ క్వీన్ త్రిష.. తన అభిమానులతో సందడి చేసి దాదాపు మూడేళ్లు దాటిపోయింది. ఆమె న‌టించిన ప‌లు చిత్రాలు అనివార్య కార‌ణాల‌తో ఆగిపోవ‌డంతో నిరాశ తప్పలేదు. ఇదిలా ఉంటే.. అర‌వింద స్వామి, త్రిష జంట‌గా 2016లో మొదలైన 'శ‌తురంగ‌వెట్టై 2' సినిమా ఎట్టకేల‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబ‌ర్ 7న ఈ సీక్వెల్‌ను రిలీజ్ చేయ‌బోతున్నట్లు చిత్ర నిర్మాత‌లు ప్రక‌టించారు. ఇందులో అర‌వింద‌ స్వామి, త్రిష నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్‌ ప్లే చేసినట్లు స‌మాచారం. ఈ సినిమా 2017లోనే విడుద‌ల‌కావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక స‌మ‌స్యల‌కు తోడు ద‌ర్శక‌ నిర్మాత‌ల మ‌ధ్య క్లాషెస్ కార‌ణంగా ఇన్నాళ్లూ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. దీంతో పాటు మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న 'పొన్నియిన్ సెల్వన్‌' చిత్రంలోనూ త్రిష కీల‌క పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 30న విడుదల కానున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై త్రిష బోలెడన్ని ఆశలు పెట్టుకోగా.. వారం గ్యాప్‌తో 'శ‌తురంగవెట్టై 2' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.

Next Story

Most Viewed