భానుడి ప్రతాపం.. అక్కడ 43.3 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత..

by Disha Web Desk 19 |
భానుడి  ప్రతాపం.. అక్కడ 43.3 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మార్చి చివరి రోజుల్లోనే ఏకంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్టోగ్రత నమోదైంది. జిల్లాలోని బేలా మండలం చాపర్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత ఆదిలాబాద్ అర్బన్ కేంద్రంలో 43.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇలా కుమురంభీం జిల్లా కరిమెరిలో 43.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్‌లో 43.1, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 42.9 డిగ్రీలు నమోదయ్యాయి. పెరుగుతున్న రోజువారి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది.

Next Story

Most Viewed