రోడ్డు ప్రమాదంలో యువతికి గాయాలు!

by Disha Web Desk 13 |
రోడ్డు ప్రమాదంలో యువతికి గాయాలు!
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన గురువారం స్కూటీ, కారు ఢీకొన్న సంఘటనలో ఓ యువతికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని నెంబర్-2 బస్తీకి చెందిన రమాదేవి స్కూటీ తో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకు విరిగిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ మేరకు బెల్లంపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed