దారుణం: ప్రియుడ్ని చితకబాది.. ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

by Disha Web Desk 19 |
దారుణం: ప్రియుడ్ని చితకబాది.. ప్రియురాలిపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకూ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా.. ప్రియుడ్ని చితకబాది.. ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అప్పుడప్పుడు ఆఫీస్ ముగిసిన వెంటనే వెళ్లి ఓ భవనంలో తన లవర్‌ను కలిసేది. ఇదే భవనంలో వీరు చాలా సార్లు కలిశారు. దీనిని అక్కడే ఉంటున్న కొందరు యువకులు గమనించారు.

ఎప్పటిలాగే యువతి సోమవారం రోజు తన బాయ్ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఆ భవనానికి వెళ్లింది. ఇది గమనించిన యువకులు వెళ్లి.. వారిని బలవంతంగా వేరే ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం యువతి ప్రేమికుడిపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబుతే చంపేస్తామని బెదిరించి.. యువతిని తీసుకెళ్లి స్థానిక బస్టాండ్ వద్ద వదిలేశారు. ఆ యువతి అక్కడే ఉండి ఏడుస్తుండగా.. అదే సమయానికి అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు యువతిని ఏమైందని ప్రశ్నించారు. యువతి పోలీసులకు జరిగిన దారుణం గురించి వివరించింది. వెంటనే పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించి.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed