కొంప ముంచిన షేర్ చాట్..మహిళతో యువకుడి సహజీవనం.. గర్భవతి కావడంతో..

by Dishanational2 |
కొంప ముంచిన షేర్ చాట్..మహిళతో యువకుడి సహజీవనం.. గర్భవతి కావడంతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అబ్బాయిని చూడాలన్నా, మాట్లాడాలి అన్న మహిళలు భయపడేవారు. కానీ ప్రస్తుతం ట్రేండ్ మారింది. ఏకంగా ముక్కు మోహం తెలియని యువకులతో సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకుని పెళ్లికి రెడీ అయి చివరకు ఎంతో మంది మహిళలు మోసపోతున్నారు. తాజాగా ఇలానే హైదరాబాద్‌లో ఓ ఘటన జరిగింది.

షేర్ చాట్ ద్వారా ఓ మహిళకు యువకుడు పరిచయం అయ్యాడు. ఇక వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అబ్బాయి కూడా మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. ఇక భర్త చనిపోయి, ఒక కుమారుడితో జీవనం సాగిస్తున్న తనకు తోడు దొరికిందని ఆశపడింది ఆ మహిళ. దీంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆయన ఏకంగా గదిలోనే తాళి కట్టేశాడు. దీంతో మహిళ యువకున్ని పూర్తిగా నమ్మి తననే భర్తగా భావించి సంతోషంగా ఉండేది.

కానీ తన జీవితంలో అనుకోని సంఘన ఎదురవుతోందని మహిళ ఊహించలేదు. కొన్ని రోజుల గడిచిన తర్వాత మహిళ గర్భవతి కావడంతో యువకుడి అసలు రంగు బయట పడింది. ఎంతో నమ్మించి తనతో సహజీవనం చేసిన వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించింది. తాను ప్రెగ్నెంట్ కావడంతో పెళ్లిని రిజిస్టార్ చేయిచుకోవాలని మహిళ ఎంత బతిమిలాడినా దానికి యువకుడు నో చెప్పాడు. దీంతో యువతికి కొంచెం తేడాగా అనిపిచడంతో ఒక రోజు కోపంగా మన పెళ్లిని న్యాయబద్ధం చేయి అని కోరగా, మరసటి రోజు యువకుడు తమ ఊరికి వెళ్లి మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రాలేదు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story