టెక్నాలజీతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన యువ రైతు

by Jakkula.Mamatha |

యాంత్రికరణ వ్యవసాయంలో టెక్నాలజీ అనుసరిస్తూ పంటలు సాగు చేస్తున్నాడు యువరైతు.

టెక్నాలజీతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన యువ రైతు
X

దిశ, ఉప్పునుంతల: యాంత్రికరణ వ్యవసాయంలో టెక్నాలజీ అనుసరిస్తూ పంటలు సాగు చేస్తున్నాడు యువరైతు. ఉప్పునుంతల గ్రామానికి చెందిన రవిచంద్ర అనే యువరైతు 5 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటలో గుంటుక కొట్టడానికి డీజిల్‌తో నడిచే మినీ టిల్లర్ వాడుతూ రోజుకు 3 ఎకరాలు కొడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎకరాకు కేవలం ఒక లీటర్ డీజిల్ మాత్రమే వాడుతున్నానని 150 రూపాయల ఖర్చుతో ఒక రోజు పనులు చేసుకున్నట్లు తెలిపాడు. అదే ఎద్దుల ద్వారా ఐతే ఒక రోజు కిరాయి రూ.2500 అవుతుందని అందుకే ఈ నూతన పద్ధతి సాగును ఎంచుకున్నట్లు యువరైతు తెలిపారు.

Next Story