ఆ సమయంలో గట్టిగా కేకలు వేసిన భార్య.. భర్తకు అనుమానమొచ్చి..

by Disha Web |
ఆ సమయంలో గట్టిగా కేకలు వేసిన భార్య.. భర్తకు అనుమానమొచ్చి..
X

దిశ, దుబ్బాక : వ్యవసాయ పొలం వద్ద సాగు పనిలో నిమగ్నమైన మహిళా రైతు మెడలోంచి పుస్తెళతాడు లాక్కేల్లడానికి యత్నించిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నంట దేవేందర్ రెడ్డి తన భార్య విజయతో కలిసి పొలంలో కలుపు మొక్కలను తొలగించే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలో భర్త దేవేందర్ రెడ్డి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన మహేశ్ ఒంటరిగా సాగు పని చేసుకుంటున్న విజయ మెడలోంచి పుస్తెళతాడు లాక్కెల్లడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె గట్టిగా దొంగ దొంగ అని అరుస్తూ అతన్ని పట్టుకుంది. దేవేందర్ రెడ్డితో పాటు సమీప రైతులు మహేష్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గతంలో తన వ్యవసాయ పొలం వద్ద చరవాణితో పాటు రూ .10 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మధు తెలిపారు.



Next Story

Most Viewed