అనుమానాస్పద స్థితిలో మహిళా బ్యాంక్ మేనేజర్ మృతి..

by Disha Web |
అనుమానాస్పద స్థితిలో మహిళా బ్యాంక్ మేనేజర్ మృతి..
X

దిశ, కేయూ క్యాంపస్ : మహిళా ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో అనూష నివాసం ఉంటుంది. తను బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది. బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

కుటుంబ సభ్యుల సమాచారం మేరకు భర్త ప్రవీణ్ గత కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బోరున విలపించారు. అనూష కుటుంబ సభ్యులు కేయూ పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed