మంత్రి కేటీఆర్ కు రిటైర్డ్ ఆర్మీ జవాన్ స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 12 |
మంత్రి కేటీఆర్ కు రిటైర్డ్ ఆర్మీ జవాన్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ పై చేసిన వ్యాఖ్యలకు ఓ ఆర్మీ జవాన్( రిటైర్డ్) గట్టి కౌంటర్ ఇచ్చారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ బోర్డు నగర అభివృద్ధికి అడ్డంగా మారుతుందన్నారు. అలాగే కంటోన్మెంట్ వారు రోడ్లను బ్లాక్ చేయడం పై కూడా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ వారు ఇలానే అభివృద్ధికి అడ్డుగా మారితే తాము చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే కంటోన్మెంట్ కు కరెంట్, తాగునీరు కట్ చేస్తామని అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది.

అయితే మంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ జవాన్ ( రిటైర్డ్) ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ను జోకర్ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జవాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇలా అన్నారు. జోకర్ కేటీఆర్ కంటోన్మెంట్‌కు కరెంటు సరఫరా, నీళ్లు నిలిపివేస్తానని ఇండియన్ ఆర్మీని బెదిరిస్తున్నాడు. ''మిత్రమా మీరు ఈ ఆర్మీ వల్లనే ప్రశాంత గాలిని పీల్చుకుంటున్నారని మర్చిపోకండి'' అని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.


Next Story