నగరంలో ఆ దేశ పక్షి..స్థానికులు ఏం చేశారంటే..?

by Disha Web |
నగరంలో ఆ దేశ పక్షి..స్థానికులు ఏం చేశారంటే..?
X

దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ నగరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాంనగర్ ఆజమాబాద్ ఎస్సార్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు పెద్ద వృక్షానికి ఉన్న పతంగ్ మాంజాకు చిక్కుకుంది. విలవిలలాడుతున్న ఆ పక్షిని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. వెంటనే చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి ఆ పక్షి దాహాన్ని తీర్చారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు. అనంతరం 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్షిని అటవీశాఖ అధికారులు తీసుకెళ్ళారు.



Next Story