ఒంటరి మహిళపై వ్యక్తి దారుణం.. బంధువులు ఏం చేశారంటే?

by Disha Web |
ఒంటరి మహిళపై వ్యక్తి దారుణం.. బంధువులు ఏం చేశారంటే?
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని చెంచు పెంట‌కు చెందిన ఆదివాసి వివాహితపై ఒక వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందుకు సంబంధించి అమ్రాబాద్ సిఐ ఆదిరెడ్డి, ఎస్ ఐ కృష్ణదేవ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎలుక చేను నాగరాజు అనే వ్యక్తి తాగిన మైకంలో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. కాగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. బాధితురాలిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు పై అత్యాచార కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.



Next Story

Most Viewed