జీహెచ్ఎంసీ అధికారులపై మాదాపూర్ డీసీపీకి 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు

by Dishanational1 |
జీహెచ్ఎంసీ అధికారులపై మాదాపూర్ డీసీపీకి 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రహదారుల మరమ్మతుల గూర్చి పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేయాలని 11 ఏళ్ల బాలిక శనివారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ తోపాటు సర్కిల్-20లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పైనా కేసు నమోదు చేయాలని డీసీపీ శిల్పవల్లికి శాహెర్ కౌర్ అనే బాలిక ఫిర్యాదు చేసింది. గతంలో రోడ్ల మరమ్మతులపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు పేర్కొంది. 4 నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 11 ఏళ్ల బాలిక జీహెచ్ఎంసీ అధికారుల మీద ఫిర్యాదు చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story