- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బస్సును ఢీకొన్న కారు.. ప్రమాదంలో 25 మంది..
దిశ, వెబ్డెస్క్: ఎదురుగా వస్తున్న బస్సును ఓ కారు ఢీ కొట్టింది. అతి వేగంగా వస్తుండటంతో కారు కంట్రోల్ కాలేదని స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పూణె- అహ్మద్నగర్ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్విఫ్ట్ కారు అతివేగంగా వస్తుంది. వేగం కారణంగా కారు అదుపుతప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడని, అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. అయితే కారు ఢీ కొట్టడంతో బస్సు స్కిడ్ అయ్యి పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలపై ఒరిగిపోయిందని వారు తెలిపారు. ఈ ప్రమాదం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని, ఎవరిది తప్పు అన్న విషయాన్ని ఆ వీడియో ద్వారా తెలుసుకోనున్నామని పోలీసులు తెలిపారు.