బస్సును ఢీకొన్న కారు.. ప్రమాదంలో 25 మంది..

by Dishafeatures2 |
బస్సును ఢీకొన్న కారు.. ప్రమాదంలో 25 మంది..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదురుగా వస్తున్న బస్సును ఓ కారు ఢీ కొట్టింది. అతి వేగంగా వస్తుండటంతో కారు కంట్రోల్ కాలేదని స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పూణె- అహ్మద్‌నగర్‌ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్విఫ్ట్ కారు అతివేగంగా వస్తుంది. వేగం కారణంగా కారు అదుపుతప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడని, అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. అయితే కారు ఢీ కొట్టడంతో బస్సు స్కిడ్ అయ్యి పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలపై ఒరిగిపోయిందని వారు తెలిపారు. ఈ ప్రమాదం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని, ఎవరిది తప్పు అన్న విషయాన్ని ఆ వీడియో ద్వారా తెలుసుకోనున్నామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed