టీజేఎస్‌ అధ్యక్ష పదవికి కోదండరాం పోటీ

by Disha Web Desk |
టీజేఎస్‌ అధ్యక్ష పదవికి కోదండరాం పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో :తెలంగాణ జన సమితి రెండో ప్లీనరీ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ అధ్యక్ష పదవికి ప్రొఫెసర్​కోదండరాం పోటీ చేయనున్నారు. కాగా ఆయన తరపున నామినేషన్​ను పార్టీ శ్రేణులు ఎన్నికల అధికారులు సత్యనారాయణకు సమర్పించారు. నామినేషన్ పత్రాలను రెండు సెట్లు విడిగా సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి గంగపురం వెంకట్ రెడ్డి ఒక సెట్‌ను సమర్పించారు, మరో నామినేషన్ సెట్ ప్రధాన కార్యదర్శి ధర్మర్జున్, పల్లె వినయ్ సమర్పించారని టీజేఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ బద్రోద్దీన్ ప్రకటించారు.

నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీం పాషా, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు బాబూ మహాజన్, విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్, యూత్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కొత్త రవి, యూత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వీరన్న, విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్, విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి నరేందర్, హైదరాబాదు జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed