తెలుగు చిత్రసీమలో విషాదం

by  |
తెలుగు చిత్రసీమలో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహామ్మారి వలన ఎంతో మంది రాజకీయనాయకులు, నటులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ గాయకుడు ‘విఠలా విఠలా పాండురంగ విఠలా’ ‘ఒక వేణువు వినిపించెను’ ‘దిక్కులు చూడకు రామయ్య లాంటి అద్భుతమైన పాటలను మనకందించిన జి. ఆనంద్(67) గత రాత్రి కరోనాతో కన్ను మూశారు. ఆయనకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను గత కొన్ని రోజుల నుంచి హోం ఐసోలెషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమిచడంతో అతన్ని హైదరాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.


Next Story

Most Viewed